- ఇండియా కూటమి అభ్యర్థి బొబ్బిలి శ్రీను
ప్రజాశక్తి-విజయనగరంకోట : బూటక హామీలను నమ్మకండి అని విజయనగరం పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి బొబ్బిలి శ్రీను అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలో మొసానిక్ టెంపుల్లో ఏర్పాటు చేసిన వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గంలో కొప్పల వేలం ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కొప్పల వెలుగును గుర్తించకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం మహా ఆనందంగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షులు షర్మిల మమ్మల్ని గుర్తించి గౌరవించి టికెట్ కేటాయించడం గొప్పలవేలమని ప్రాధాన్యం గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా లో ఉన్న మూడు లక్షల మంది కొప్పుల వెలమ తరపున నన్ను గుర్తించడం సూపర్నేమన్నారు ఇది అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్రంలో దేశంలో కొప్పల వేళలను గుర్తించడం శుభ పరిణామం అన్నారు కొప్పల వెలమ అందరి మద్దతు ప్రకటించాలని ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వెనుకబడిన సామాజిక వర్గాల్లో కొప్పలగలము ఒకటి అన్నారు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి అన్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలు ఇరిగేషన్ వ్యవసాయ రంగం ప్రధాన ఆధారంగా జీవనం సాగిస్తున్న జిల్లా ప్రజలకు అండగా నిలబడతానన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీసుకురావడం జరిగింది అన్నారు కాంగ్రెస్ గాని అధికారంలోకి వస్తే ఉపాధి హామీ వారందరికీ 400 రూపాయలు కనీస వేతనంగా సాధించడానికి పోరాటం చేస్తా అన్నారు అన్ని వర్గాలకు అభివద్ధికి కషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి గోపాల్, రామారావు, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.