వైన్‌ షాపుల ముందు మందుబాబుల బారులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులకు 48 గంటల పాటు డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం నుంచి యర్రగొండ పాలెం పట్టణంలోని మద్యం షాపుల దగ్గర మందుబాబులు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడన్నున్నాయి. దీంతో మందుబాబులు వైన్‌ షాపుల ముందు క్యూలో గంటల తరబడి నిలబడి మద్యం సీసాలను అట్టపెట్టెల్లో, జేబుల్లోనూ, రెండు చేతులతోనూ పట్టుకొని వెళ్లిపోతున్నారు. కాగా కొన్ని మద్యం షాపుల్లో స్టాక్‌ అయిపోయిందని చెప్పి మందుబాబులను వెనుకకు పంపి వేస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అయినా మందుబాబులు గత్యంతరం లేక అధిక ధరలకు బ్లాక్‌ మార్కెట్‌లో తీసుకోక తప్పడం లేదని వాపోతున్నారు.

➡️