ప్రజాశక్తి-టీ.నర్సాపురం : మండల కేంద్రంలో రెండో రోజు అంగన్వాడీల సమ్మె జయప్రదంగా జరిగింది. మండలంలోని 66 అంగన్వాడి సెంటర్ లు మూసివేసి అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు తమ విధులను బహిష్కరించి రెండో రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ సిఐటియు జిల్లా నాయకులు ఆర్. వి. ఎస్. నారాయణ, నత్తా వెంకటేశ్వర్ రావ్ శిబిరం వద్ద అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని, అంగన్వాడీ కార్యకర్తలందరూ మొక్కవోని దీక్షతో సమ్మెలో పాల్గొనాలని కోరారు. వీరి సమ్మెకు సంఘీభావంగా రైతు సంఘం జిల్లా నాయకులు అనుమాలు మురళి తెలియజేశారు. శిబిరం ఉన్న ఎమ్మార్వో ఆఫీస్ నుండి సొసైటీ వరకు తమ డిమాండ్ల సాధనకు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ నాయకురాలు B. పనివర్ధిని, N. మార్తమ్మ, M. సత్యవతి, k. బాబి,G. రామదుర్గ, B. అచ్చలమ్మ నాయకత్వం వహించారు.