ఎన్నికల సామగ్రి పంపిణీకు సర్వం సిద్ధం

ప్రజాశక్తి – ఉంగుటూరు

ఈనెల 12న నారాయణపురం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లను ఉంగుటూరు రిటర్నింగు అధికారి ఎస్‌ఎస్‌కె.ఖాజావలీ శనివారం పర్యవేక్షించారు. 214 పోలింగు కేంద్రాలకు గానూ 25 సెక్టోరోలర్‌ అధికారులకు బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సునాయాసంగా పంపిణీ చేసేందుకు సరిపడా టేబుల్స్‌, స్టాల్స్‌, కుర్చీలు అమర్చిన ఏర్పాట్లను దగ్గరుండి ఆయన పరిశీలించి తగు సూచనలిచ్చారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు కూలర్లు బిగించారు. సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

➡️