ప్రజాశక్తి – ఏలూరు సిటీ
ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గంలోని వైసిపిలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలు, అరాచకాలు లేకుండా ఆళ్ల నాని నాయకత్వంలో ఏలూరు నగరం ప్రశాంతంగా ఉందని, మళ్లీ ఆయనే రావాలంటూ టిడిపి, జనసేన పార్టీలకు చెందిన సుమారు 200 మంది శనివారం వైసిపిలో చేరారు. శ్రీరామ్ నగర్ లోని క్యాంప్ కార్యాలయానికి తీన్మార్ డప్పులతో ఊరేగింపుగా వచ్చి బాణాసంచా కాల్చి ఎంఎల్ఎ ఆళ్ల నాన్ని సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. పిల్లా దేవేంద్ర నాయుడు, పేరాబత్తుల జయదీప్ నాయుడు, పల్లంట్ల బాలు నాయుడు ఆధ్వర్యంలో చేరిన 200 మందికి ఎంఎల్ఎ ఆళ్ల నాని పార్టీ కండువాలు కప్పి వైసిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏలూరు నగర ప్రజల ప్రశాంతమైన జీవనానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని, ప్రజలకు అండగా ఉంటానని ఎంఎల్ఎ తెలిపారు.