పాడి రైతులకు హెల్త్ కార్డులు పంపిణీ

Nov 24,2023 14:55 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి : మండలం అజ్జరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామ పాడి రైతులకు యానిమల్ హెల్త్ కార్డులు పంపిణీ చేసినట్టు మండల పశు వైద్యాధికారి వానపల్లి చరణ్ ఫణీంద్ర తెలిపారు. ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న పశుగ్రాసం ఇటీవల ప్రవేశపెట్టిన యానిమల్ హెల్త్ కార్డును ప్రతి రైతు తీసుకోవాలని ఆయన తెలిపారు. పాడి రైతు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారపాటి నాగ సుధా భూషణం వెంకటరాయపురం సర్పంచ్ బాలాజీ ,రైతు భరోసా ఛైర్పర్సన్ ఏడుకొండలు వైసిపి గ్రామ అధ్యక్షుడు నాగిరెడ్డి వెటర్నరీ అసిస్టెంట్ సాయి పాడి రైతులు పసు పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.

➡️