టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలు మండలంలోని అల్లీనగరం పంచాయతీ మాజీ ఎంపిటిసి పుల్లా కేశవరాయుడు, మాజీ సర్పంచ్‌ పుల్లా విజయలక్ష్మి శుక్రవారం గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్ముల అశోక్‌రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. వీరితోపాటు కొమరోలు మండలంలో 30 కుటుంబాలు, టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. వీరికి అశోకరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎంపిటిసి పుల్లా కేశవనాయుడు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంతో పాటు కొమరోలు మండలం, అల్లీనగరం అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థి అయిన ముత్తుముల అశోక్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. మాజీ సర్పంచి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా ఒక్క టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. వైసిపిలో మహిళలకు రక్షణ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ఒక్క టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️