కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకూ రక్షణ

Apr 27,2024 23:29
కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాలకూ రక్షణ

ప్రజాశక్తి-ఏలేశ్వరం కాంగ్రెస్‌ పార్టీతోనే దేశంలో అన్ని వర్గాలకూ రక్షణ సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి ఎంఎం.పల్లంరాజు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణతో కలిసి శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాటలు ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జాతీయ సమగ్రత, శాంతి, సౌభ్రాతత్వం నెలకొల్పడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. దేశంలో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకులు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వివరించారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు ఓట్లు వేయడం ద్వారా దేశాన్ని రక్షించుకోవాలని ఆయన కోరారు. నీరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌డిఎ కూటమి, వైసిపి పార్టీలు అవినీతి మయం అయ్యాయయన్నారు. అమలు కానీ హామీలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీని అధికారం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొయ్యేటి సూర్యప్రకాశరావు, కొప్పన కోటేశ్వరరావు, కరణం శ్రీనివాస్‌, మొయ్యేటి నారాయణ, తాతపూడి జార్జి రాజు ఉన్నారు.

➡️