ప్రజాశక్తి – చాపాడు (కడప) : అందుబాటులో ఉన్న న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి ఖాజా మైనుద్దీన్ సూచించారు. చాపాడు మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో మోడల్ గ్రామంగా కేతవరంను ఎంపిక చేసి న్యాయ విజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ … ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి తద్వారా అన్యాయం జరిగినప్పుడు న్యాయం పొందాలన్నారు. పుట్టబోయే బిడ్డ నుంచి మఅతి చెందే వరకు ప్రతి ఒక్కరికి చట్టాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చట్టానికి అందరూ సమానమని ప్రతి ఒక్కరూ చట్టాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా నడవాలన్నారు. న్యాయవాదులు అందుబాటులో ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మైనుద్దీన్, ఆర్ఐ ప్రవీణ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి నారాయణ రెడ్డి, పిపి వి.జేయన్ శర్మ, ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాదులు జేకే చారి, సిసి పుల్లయ్య, ఏవి రమణ, కరిముల్లా, ప్యానల్ అడ్వకేట్ ఎం శ్రీనివాసులు ,జూనియర్ అడ్వకేట్ ఖాదర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.