ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఎండల తీవ్రత ఎక్కువగా దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని డ్వామా ఏపీడి పాలేటి వెంకటస్వామి డ్వామా సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని గురవారెడ్డి పాలెం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను డ్వామా ఒంగోలు క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాలేటి వెంకటస్వామి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీడి వెంకటస్వామి మాట్లాడు తూ ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం పని చేసిన కూలీలకు 300 రూపాయల వేతనం తగ్గకుండా ఉండే విధంగా చూడాలని కోరారు. ఆయన వెంట ఏపీవో వాసంతి, టిఏలు, ఎఫ్ఏలు, బిఎఫ్టి మేట్లు ఉన్నారు.