హామీ మేరకు పింఛను పెంపు : మంత్రి

Jun 29,2024 21:21

 ప్రజాశక్తి-గంట్యాడ : ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను పెంపుదల చేసినట్లు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం గంట్యాడలో టిడిపి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛనుదారుల గౌరవాన్ని పెంచడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నారని తెలిపారు. పింఛన్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఎంతో భారమైనా లెక్కచేయకుండా హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జులై ఒకటో తేదిన సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేపడతారని చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానన్నారు.

➡️