ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలందరికీ అందుబాటులో నాణ్యమైన అత్యాధునిక గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ ఏర్పాటైందని పలువురు అన్నారు. కంటోన్మెంట్లో డాక్టర్ ఐ.నరేష్కుమార్ ఆధ్వర్యాన నిర్మించిన చేతన్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ను ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎమ్డి ఇ.పెదవీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులకు అధునాతన వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. అలాగే లాపరోస్కోపీ, జీర్ణ కోశ కేన్సర్ సర్జరీ చికిత్సలు నిర్వహిస్తారన్నారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపి, ఇఆర్సిపి, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్ బి, సి, ప్యాంక్రియాటిక్ వ్యాధులకు చికిత్స నిర్వహిస్తామన్నారు. ఇక్కడ అధునాతన ఐసియు, అంబులెన్స్ సౌకర్యం ఉందన్నారు. కాబట్టి జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ పి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.