ప్రజాశక్తి-విఆర్.పురం (అల్లూరి) : మండలంలోని ఉన్న చిన్నమట్టపల్లి చింతరేగుపల్లి, అడివెంకన్నగూడెం, రామవరం, ఆయా బడులను పిల్లలు భోజనము శనివారం రోజున ఎంపీపీ కారంలక్ష్మితోపాటు సిపిఎం బఅందం పరిశీలించింది. విద్యార్థులకు భోజనము సక్రమంగా అందుతుందా అని ఎంపీపీ అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ … విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని విద్యార్థుల రేపటి భవిష్యత్తును దఅష్టిలో ఉంచుకొని చదువు సక్రమంగా చెప్పాలని కోరారు. బడిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దఅష్టికి తీసుకురావాలని చెప్పారు. మండలంలోని బడులలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థులకు చదువులు చెప్పలేకపోతున్నారని, తక్షణమే ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట నియమించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ … ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉందని అందువల్ల విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నామని అన్నారు. 60 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండటం వలన కొన్ని బడుల్లో డిప్యూటేషన్ మీద ఒకరే ఉపాధ్యాయులు ఉండటం వలన ఈ సమస్య ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం. సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం.చిన్నబాబు, పంకు.సత్తిబాబు, కారం సుందరయ్య, వడ్లాది.రమేష్, జి.లక్ష్మణరావు. సిరపు.తాతబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/mpp.jpg)