గోకుల్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ షర్మిల
వైసిపికి జడ్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి రాజీనామా
వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
నంద్యాల మండల జట్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి వైసిపికి సోమవారం రాజీనామా చేశారు. స్థానిక లోటస్ పాండ్లో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల గోకుల్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. నంద్యాల వైసిపి ఎమ్మెల్యే శిల్పా రవి పని తీరు నచ్చక, నంద్యాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అయన అనుచరులు తెలిపారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డి బరిలో నిలుస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీటు దాదాపు ఖరారయినట్లు చర్చ జరుగుతోంది.