పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

Apr 28,2024 21:28

 ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో కెవిఆర్‌ కాలేజీలో ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌, నందిగామ జిల్లాపరిషత్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రాలను, నందిగామ పోలిస్‌ స్టేషన్‌ ను ఆదివారం సాయంత్రం విజయవాడ పోలిస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నందిగామలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పని చేయాలని కోరారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పోలీసు భద్రత పటిష్ఠంగా ఉండాలని ఆదేశించారు. నందిగామ ఎసిపి రవి కిరణ్‌, సిఐ హరీష్‌, ఎస్‌ఐ పండుకొని, దుర్గ రావు పాల్గొన్నారు.

➡️