ప్రజాశక్తి-పెందుర్తి : ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు చెప్పారు. జివిఎంసి 92వ వార్డు పరిధి బాలాజీ గార్డెన్లో బాలాజీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, 97వ వార్డు పరిధి సుజాతనగర్ ప్రైవేట్ కల్యాణ మండపంలో కమ్మ సామాజికవర్గం ఆత్మీయ సమావేశాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్బాబు మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, రాక్షసులను ఓడించి మనం గెలవాలని పేర్కొన్నారు. అభివృద్ధి లేకపోవడంతో ఉపాధి అవకాశాలు ఎక్కడా లేవన్నారు. ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజి విద్యా సంస్థల అధినేత మాండవ రవికుమార్, 94వ వార్డు కార్పొరేట్ బల్ల శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్ శానాపతి శంకరరావు, కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన కిషోర్ కుమార్, సత్య, గంగాధర్, అర్జున్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.