వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్ధం : బండారు సంజీవ్‌

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ బండారు సత్యానందరావు కుమారుడు టిడిపి యువనేత బండారు సంజీవ్‌ అన్నారు. మండలంలోని నర్సిపూడిలో జరిగిన ” బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ ప్రతి ఒక్కరికి సూపర్‌ సిక్స్‌ పథకాల గురుంచి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి అంతా తెలుగుదేశం ప్రభుత్వం లోనే జరిగిందని మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో త్రాగునీటి సమస్యను తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️