వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం: ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-చీరాల: వైసీపి ప్రభుత్వంతో రాష్ట్రం ప్రజలు విసిగిపోయి ఎన్నికల్లో తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, ఓటమిపాలైన తర్వాత జగన్‌, అవినాష్‌రెడ్డి, భారతిరెడ్డి దేశం వదిలి పారిపోతా రని సొంత చెల్లి షర్మిలారెడ్డి చెబుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల వారి కుటుంబ సభ్యులే అసహనంతో ఉన్నారని అన్నారు. వైసిపికి ఓటు వెయ్యొద్దని జగన్‌ సొంత చెల్లెళ్లు షర్మిల, సునీతలు బహిరంగంగానే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వచ్చిందని కన్న తల్లి విజయమ్మ సైతం అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది అన్నారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీసీ కెమెరాలు ప్రాజెక్టును కూడా తాకట్టుపెట్టి రూ.532 కోట్లు తీసుకున్నాడని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది అని మండిపడ్డారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు జగన్‌ మరో ఎత్తుగడ వేశాడన్నారు. చీరాల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఎంఎం కొండయ్యను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

➡️