ప్రజాశక్తి -పులివెందుల టౌన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసిపి అభ్యర్థుల తరఫున వారి సతీమణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆది వారం తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్.భారతి, కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి సతీ మణి సమత ఇంటింటి ప్రచారం చేస్తూ వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసు కున్నారు. జగన్మోహన్రెడ్డిని, అవినాష్రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తాడని, టిడిపి అధినేత చంద్రబాబు చెప్పి మోసం చేస్తాడని, జగన్ వెంటే జనం ఉన్నారని గెలిచేది వైసిపి అని పులివెందులలో గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన హామీలన్నీ మోసపూరితమైన హామీలేనని జగన్ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసిపి గెలిపించాల పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్.అవినాష్రెడ్డి సతీమణి సమత, అభిషేక్రెడ్డి సతీమణి కృష్ణచైతన్య, వైసిపి నాయకులు దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.