నెల్లిమర్లలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట : త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్‌ ఆదేశాలతో మంగళవారం నెల్లిమర్ల మండలంలోని నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌ నుండి మొయిద జంక్షన్‌ మీదుగా జర్జాపుపేట గ్రామం వరకు నెల్లిమర్ల ఎస్‌ఐ రామ గణేష్‌ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ప్రజలందరూ ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను ఎస్‌ఐ కోరారు.

➡️