11న కడపకు రాహుల్‌ గాంధీ రాక

ప్రజాశక్తి – కడప కడప జిల్లా కేంద్రమైన కడప నగ రానికి ఈనెల 11న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రాను న్నారు. ఇప్పటికే స్థానిక బిల్టప్‌ సర్కిల్‌ వద్ద ఉన్న పుత్త ఎస్టేట్‌ మైదానంలో బహిరంగ సభకు పిసిసి అధ్యక్షులు వైయస్‌ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వేసవి దష్ట్యా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో పైకప్పుతో పాటుగా ఇతరత్రా శీతల యంత్రాలు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ఈనెల 13వ తేదీన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్‌ గాంధీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బుధవారం బహిరంగ సభ ఏర్పాట్లను కడప నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి అఫ్జల్‌ ఖాన్‌, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మైనార్టీ ఉపాధ్యక్షుడు పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌, షర్మిల ప్రత్యేక బందం ప్రతినిధి సతీష్‌ ఇతర నేతలు సందర్శించి పనులను పర్యవేక్షించారు.

➡️