ప్రజాశక్తి-విజయనగరం కోట : పత్రికల్లో వస్తున్న కథనాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందిస్తున్నారు. ప్రజాశక్తిలో వరుసగా శుక్ర, శనివారాల్లో వచ్చిన కథనాలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘కార్పొరేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాన్ని అరికట్టాలి’, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం’ అనే శీర్షికలతో వచ్చిన కథనాలకు ఆయన స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తనకు నివేదించాలని ఆదేశించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/vzm-news-clip-copy.jpg)