స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా పనిముట్లు పంపిణీ

Jun 30,2024 22:26

పనిముట్లను పంపిణీ చేస్తున్న ఆర్‌జె. రత్నాకర్‌ 

                    పుట్టపర్తి క్రైమ్‌ : శ్రీ సత్య సాయి సేవ సంస్థలకు చెందిన భక్తులు స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా పలువురికి పనిముట్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌ జె రత్నాకర్‌, ఆయన సతీమణి హిమవాహిని చేతులు మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి సుమారు 1500 మంది భక్తులు పుట్టపర్తికి రెండు రోజులపాటు నిర్వహించే పర్తి యాత్రలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆర్థిక సిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సత్యసాయి స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా సత్య సాయి సేవ ఆర్గనైజన్స్‌ గ్రామీణ ప్రాంతాల్లో అనేక కేంద్రాలను స్థాపించిందన్నారు. పురుషులకు ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలతో కూడిన ప్రత్యేక టూర్‌ కిట్లను, మహిళలకు పిండి మిషన్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

➡️