వినతిపత్రం అందజేస్తున్న ఆటోయునియన్ నాయకులు
ధర్మవరం టౌన్ : తమకు ఇంటి స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ నాయకులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూదన్రెడ్డిని కోరారు. ఈ మేరకు వారు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో చిలకం మధుసూదన్రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. పట్టణంలో దాదాపు 400 మంది ఆటో కార్మికులు అద్దె ఇళ్లలో ఉంటూ చాలీచాలని ఆటోసంపపాదనతో కాలం నెట్టుకొస్తున్నామన్నారు. ఆటో కార్మికులలో ఇంటిస్థలాలు లేనివారికి ఇంటిస్థలాలు ఇప్పించేలా చూడాలని వారు చిలకం మధుసూదన్రెడ్డికి విన్నవించారు. స్పందించిన చిలకం సమస్యను మంత్రి సత్యకుమార్యాదవ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి అయూబ్ఖాన్, ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్రనాయకులు రఫి, రవి, జిలాన్, రియాజ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.