3, 4 తేదీల్లో జాతీయ సెమినార్‌ొజయప్రదం చేయాలి

ఈనెల 3, 4 తేదీల్లో నగరంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని

మాట్లాడుతున్న తేజేశ్వరరావు

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 3, 4 తేదీల్లో నగరంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సిఐటియు నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సెమినార్‌కు సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, రాష్ట్రంలోని పలు కార్మికోద్యమ నాయకులు, కార్మికులు హాజరవుతారని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే సెమినార్‌లో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. సెమినార్‌ జయప్రదానికి ఉద్యోగులు, కార్మికులు, సంస్థలు, శ్రేయోభిలాషులు ఆర్థిక, హార్థిక సహకారం అందించాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కె.నాగమణి, ఎ.మహాలక్ష్మి, ఎం.ఆదినారాయణ మూర్తి, ఎన్‌.వి రమణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️