మరోసారి అవకాశం ఇవ్వండి

రాష్ట్రంలో మళ్లీ రెండోసారి వైసిపి ప్రభుత్వాన్నే గెలిపించాలని

మాట్లాడుతున్న పరిమళ, శ్రీదేవి

ప్రజాశక్తి- లావేరు

రాష్ట్రంలో మళ్లీ రెండోసారి వైసిపి ప్రభుత్వాన్నే గెలిపించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ భార్యలు గొర్లె పరిమళ, బెల్లనా శ్రీదేవిలు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తకుంకాం, పెదకొత్తపల్లి పంచాయతీల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రదేశాల్లోకి వెళ్లి ప్రజలను ఓట్లు ఆర్జించారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి సిఎంగా గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మకుండా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌ కుమార్‌ను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతం నాయుడు, మీసాల శ్రీనువాసరావు, రాజనాయుడు, నడిమింటి కుమారి ఉన్నారు.

 

➡️