వైసిపిని తరిమి కొట్టాలి : స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని తరిమి కొట్టాలని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు. జరుగుమల్లి మండల పరిధిలోని పచ్చవ వర్ధినేనివారి పాలెం, ఎన్‌ఎన్‌ కండ్రిక, కొత్తపాలెం గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్వామి మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎలాంటి అభివద్ధి పనులు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే సిమెంట్‌ రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో పోకూరి రవీంద్రబాబు, పోటు పెదబాబు, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. టిడిపిలో చేరిక కొండపి : కొండపికి చెందిన 10 కుటుంబాల వారు టిడిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి సమక్షంలో టిడడిపిలో చేరారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి నివాసంలో ఆదివారం వారు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే స్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో రాజవరపు సుబ్బయ్య, ఆవుల శ్రీను, వరిగ శ్రీదేవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️