పేదల సంక్షేమమే థ్యేయం : మేరుగ

పజాశక్తి-నాగులుప్పలపాడు : పేదల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి థ్యేయమని వైసిపి సంతనూతల పాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని మట్టిగుంట, ఈద ుమూడి, మద్దిరాల ముప్పాళ్ళ ,ఓమ్మెవరం, కండ్లగుంట గ్రామాల్లో వనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగాలంటే వైసిపికి గెలిపించి జగన్మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు లేకుంటే సంక్షేమ పథకాలు నిలిచి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎం.ముప్పాళ్ళలో మాజీ సర్పంచి పులిపాటి శీమాన్‌ , మహేష్‌ , త్యాగరాజు, బత్తుల ఆశ్వీరాదం తదితరులు జెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, వైసిపి సీనియర్‌ నాయకుడు కూనం పూర్ణచంద్రరావు , వైసిపి మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ , జడ్‌పిటిసి యాదల రత్నభారతి అశోక్‌ , జెసిఎస్‌ మండల కన్వీనర్‌ కె. సుధాకర్‌ రావు , పోలినేని కోటయ్య , పక్కెల వజ్రంబాబు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️