చెత్త నిర్వహణ కేంద్రాల పరిశీలన

చెత్త నిర్వహణ కేంద్రాల పరిశీలన

చెత్త నిర్వహణ కేంద్రాల పరిశీలనప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జాయింట్‌ సెక్రటరీ రూప మిశ్రా, కమిషనర్‌ హరిత, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవేస్ట్‌ రికవరి ప్లాంట్‌ను, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేసే ప్లాంట్‌ను అదేవిధంగా బయోమిథన్‌ గ్యాస్‌ ప్లాంట్‌ పనిచేసే విధానాన్ని కమిషనర్‌ క్షుణ్ణంగా వివరించారు. నగరంలో ప్రతి ఇంటి నుండి, హోటల్స్‌, దుకాణాల, హాస్పిటల్స్‌ నుంచి మూడు రకాలుగా చెత్తసేకరణ చేస్తున్నామని తెలిపారు. ఆ చెత్తను ఆటోల ద్వారా నగరంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు తరలిస్తామని తెలిపారు. అక్కడ నుండి పెద్ద టాంకర్ల సిఏపిఎస్‌యుఎల్‌ఈఎస్‌ ద్వారా తూకివాకం తరలించి నిర్వహణ చేస్తామని వివరించారు. బయో మిథనైజేషన్‌ ప్లాంట్‌ నుండి సిఎన్‌జి గ్యాస్‌ ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. ఈసందర్భంగా జాయింట్‌ సెక్రటరీ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న చెత్తనిర్వహణ చాలా బాగుందన్నారు. చెత్తసేకరణ విధానం కూడా బాగుందని, మరింత మెరుగ్గా చేస్తే చెత్త నిర్వహణలో దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ మోహన్‌, మునిసిపల్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, డీఈ విజయకుమార్‌ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్‌ నాగేంద్ర పాల్గొన్నారు.

➡️