నేడు తిరుపతికి బీవీ రాఘవులు

నేడు తిరుపతికి బీవీ రాఘవులు

నేడు తిరుపతికి బీవీ రాఘవులు ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి నగరంలో 29వ తేదీ జరిగే పలు కార్యక్రమాల్లో సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక యశోదానగర్‌లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. 29వ తేదీ సోమవారం ఉదయం యశోదానగర్‌, సుందరయ్యనగర్‌ ప్రాంతాల్లో సిపిఐ అభ్యర్థి పి.మురళి ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన మురళి, కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి చింతా మోహన్‌ విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరనున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 5.30గంటలకు వేమన విజ్ఞానకేంద్రంలో ఎన్నికలు నేటి పరిస్థితి అనే అంశంపై జరుగుతున్న సెమినార్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఆయనతోపాటు మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు కూడా పాల్గొంటున్నట్టు వారు తెలిపారు. అలాగే తిరుపతిలో జరుగుతున్న అరాచకాలు ప్రజలను కలవరపెడుతున్నాయని వారు వాపోయారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వైసిపి, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణకు దిగి తిరుపతి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజాసమస్యల మీద ఏమాత్రం శ్రద్ధ లేని వీరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఇద్దరు కలిసి బిజెపి పంచన చేరడం తిరుపతి లాంటి యాత్రస్థలంలో నష్టమని తెలిపారు. తమ పార్టీ తరపున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రజలంతా బివి.రాఘవులు పర్యటన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలను వారు విజ్ఞప్తి చేశారు.

➡️