బీసీ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి : జెవివిప్రజాశక్తి -రేణిగుంటరేణిగుంట బిసి హాస్టల్ సమస్యలపై రేణిగుంట మండల విద్యాశాఖాధికారి రంగనాదయ్య , మండల అభివద్ధి అధికారి విష్ణు చిరంజీవిలకు జనవిజ్ఞాన వేదిక నాయకులు కుప్పస్వామి, వెంకట రమణలు వినతి పత్రం అందజేసారు. పరిష్కారానికి కషి చేస్తామని ఎంఈఓ రంగనాదయ్య తెలిపారు. రేణిగుంట బిసి హాస్టల్లో లెట్రిన్ సంప్ నిండి పోయి చాలా కాలం అయ్యింది. అందు వల్ల పిల్లలు మూత్ర విసర్జనకు బయటకు వెళ్ళవలసి వస్తోందని చెప్పడంతో ప్రత్యేక చొరవ చూపినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట హాస్టల్కు పర్మినెంట్ వార్డెన్ను నియమించాలని, ట్యూటర్లను నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని, కిటికీలు, తలుపులు, లైట్లు, ఫ్యాన్లు స్విచ్చులు మరమ్మతు చేయాలని కోరారు. ఫిల్టర్ వాటర్ రిపేర్ చేయాలన్నారు. పంచాయతీ నీటికొళాయి కనెక్షన్ ఇప్పించాలన్నారు. పాములు తరచూ హాస్టల్లోనికి వస్తున్నాయని, వీధిలైట్లు వేయించాలన్నారు. సిబ్బందిని నియమించి విద్యార్థుల చదువులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
![బీసీ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి : జెవివి](https://prajasakti.com/wp-content/uploads/2024/06/Jvv-2.jpg)