మోసాల బాబును వెంకటగిరి బహిరంగ సభలో వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డినమ్మొద్దు

మోసాల బాబును వెంకటగిరి బహిరంగ సభలో వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డినమ్మొద్దు

మోసాల బాబును వెంకటగిరి బహిరంగ సభలో వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డినమ్మొద్దు ప్రజాశక్తి- వెంకటగిరి : మోసాల బాబును నమ్మోద్దని రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి వెంకటగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా వెంకటగిరిలోని త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాడిపత్రిలో సభ ముగించుకొని నేరుగా వెంకటగిరి విశ్వోదయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభ స్థలానికి హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం ఇదే కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అంటూ సభికులను ప్రశ్నించారు. ఆ సమయంలో నారా చంద్రబాబు సంతకంతో ఇచ్చిన హామీలను చదివి వినిపించారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే మరోసారి తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని తెలిపారు. మరో రెండు వారాల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి అక్కచెల్లెమ్మలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యథిక మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు. వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్థిడాక్టర్‌ గురుమూర్తికి చేరొక ఓటు వేసి 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచే విధంగా అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️