- మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అద్యక్షులు జి.గౌరీష్, మరో ముగ్గురు కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శంకరరావు అన్నారు. అక్రమ అరెస్టులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని కోరారు. లేనిచో పోరాటం ఉదృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.