ప్రజాశక్తి – యలమంచిలి
సిపిఎం సీనియర్ నాయకులు, చించినాడ గ్రామ మాజీ సర్పంచి రుద్రరాజు సూర్యనారాయణరాజు 18వ వర్థంతి సభ మంగళవారం చించినాడలో నిర్వహించారు. ముందుగా సూర్యనారాయణ రాజు విగ్రహం వద్ద ఉన్న పార్టీ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు కేతా సూర్యారావు ఆవిష్కరించారు. అనంతరం సూర్యనారాయణ రాజు విగ్రహానికి మాజీ ఉప సర్పంచులు రుద్రరాజు సత్యనారాయణ రాజు (వైజాగ్ రాజు) రుద్రరాజు పెదబాబు, రైతు నాయకులు రుద్రరాజు చిన్న వర్మ, సూర్యనారాయణ రాజు మూడో అల్లుడు కాశీ విశ్వనాథరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు కేతా సూర్యారావు మాట్లాడారు. చించినాడ పంచాయతీలో సిపిఎం సుమారు 65 సంవత్సరాలు పాటు అధికారంలో కొనసాగిందని, దీనిలో సుమారు 30 సంవత్సరాల పాటు సూర్యనారాయణ రాజు సర్పంచిగా, సుమారు 15 సంవత్సరాల పాటు సొసైటీ అధ్యక్షునిగా ప్రజలకు ఎనలేని సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అటువంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి కార్యకర్తా నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవ సుధాకర్, సరిపల్లి జయప్రభ, తెన్నేటి సంపతరావు, ఎం.ఆంజనేయులు, సిహెచ్ వడ్డీ కాసులు, గుబ్బల సత్యనారాయణ, గూడూరి ఆంజనేయులు, డివైఎఫ్ఐ నాయకులు టి.స్టాలిన్, విప్పర్తి నన్ని, తాడి ఉదరు, విప్పర్తి నాని, విప్పర్తి యెహౌషువ, పల్లేరు అనిల్, భారతుల రాజేష్ పాల్గొన్నారు.