భీమవరంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ఎన్నికల్లో ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థుల విజయం ఖాయమని కాంగ్రెస్‌ నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు అన్నారు. శనివారం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు, భీమవరం ఎంఎల్‌ఎ అభ్యర్థి అంకెం సీతారామ్‌ భీమవరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇండియా వేదిక విజయం సాధిస్తుందన్నారు. దేశంలో బిజెపి చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు విసుగు చెందారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన 9 పథకాలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. బిజెపి పాలనలో ప్రజలకు భద్రత లేదన్నారు. వెనుకబడిన సామాజిక తరగతుల వారికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడాదాసి గంగయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు సోము నాగ కేశవ్‌బాబు, జిల్లా స్టూడెంట్‌ అధ్యక్షులు చింతగుంట మహేష్‌ పాల్గొన్నారు.

➡️