‘సేవ్ ద టైగర్స్’, ‘సైతాన్’ సిరీస్లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మ ఫోన్ హ్యాక్ అయినట్లుగా పేర్కొన్నారు. ‘కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయ్యింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఇప్పటికే దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది.” అని దేవయాని తన ఇన్స్టా స్టోరీలో రాశారు.