శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లో 35 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకాబోతుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/maname.jpg)