‘మిస్టర్‌ ఇడియట్‌’గా రవితేజ తనయుడు

May 10,2024 19:20 #madhav, #movie

హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ‘మిస్టర్‌ ఇడియట్‌’గా డైరెక్టర్‌ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్‌ శర్మ హీరోయిన్‌గా కనిపించనుంది. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రవిచంద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. టీజర్‌ను రవితేజ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. టీజర్‌ చూస్తే … కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు

➡️