‘ఐటమ్ సాంగ్స్ అంటే నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. ‘అల్లు గారి పిల్లగాడా’ అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లు గారి అబ్బాయి కాదు’ అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పడగొట్టేస్తాడు. ఆర్యకు బైక్ కూడా లేదు. చాలా పూర్. సైకిల్ మాత్రమే ఉంది’ అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా? ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. 20 ఏళ్ల క్రితం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ‘ఆర్య’ సినిమా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల వేడుకలను హైదరాబాద్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ పైన పేర్కొన్న కామెంట్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-2 సిద్ధమవుతున్న విషయం తెలిసిందే!