సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా హిందీ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జాట్’ అనే టైటిల్ను ఖరారు చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్లోగా ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. సయామీఖేర్, రెజీనా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/1-170.jpg)