ప్రచార సభల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

  •  సిఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇసి హెచ్చరిక

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం జగన్‌, చంద్రబాబుకు ఇసి నోటీసులిచ్చింది. ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపై హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో సిఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇసి తప్పుపట్టింది. ఇప్పటికే ఈ అంశంపై జగన్‌, చంద్రబాబులకు నోటీసు జారీ చేయగా, వారిచ్చిన సమాధానంతో ఇసి సంతృప్తి చెందినా ఇకపై ప్రచార సభల్లో అలా మాట్లాడటం సరికాదంటూ హెచ్చరించింది.

➡️