గుజరాత్‌ టైటాన్స్‌కు భారీ జరిమానా

May 11,2024 12:08 #IPL, #Sports

సీఎస్‌కేతో శుక్రవారం జరిగిన మ్యాచులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ గిల్‌కు బీసీసీఐ రూ.24 లక్షల ఫైన్‌ వేసింది. అలాగే 10 మంది టీం సభ్యులకు, ఇంపాక్ట్‌ ప్లేయర్లకు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో జీటీ ప్లేయర్లకు జరిమానా వేయడం ఇది రెండోసారి. కాగా నిన్నటి మ్యాచులో గిల్‌, సాయిసుదర్శన్‌ సూపర్‌ సెంచరీలతో చెలరేగారు. దీంతో గుజరాత్‌ 35 రన్స్‌ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ ఆశలను గుజరాత్‌ టైటాన్స్‌ సజీవం చేసుకుంది.

➡️