ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం

Apr 28,2024 11:16 #Archery Competitions, #Gold, #India, #Sports

షాంఘై : చైనాలోని షాంఘై నగరం వేదికగా జరుగుతోన్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కు మరో స్వర్ణం పతకం లభించింది. ఆదివారం జరిగిన మెన్స్‌ రికర్వ్‌ విభాగం ఫైనల్‌లో భారత జట్టు దక్షిణ కొరియా జట్టును ఓడించింది. ఈ జట్టులో ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రారు, ప్రవీణ్‌ జాదవ్‌ ఉన్నారు. అంతకుముందు శనివారం భారత కాంపౌండ్‌ ఆర్చర్లు మొత్తం అయిదు పతకాలు గెలిచిన విషయం విదితమే.

➡️