విశాఖ : నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపిఎల్ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాలు పేటీఎం ఇన్సైడర్ వెబ్ సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి చేపట్టనున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈనెల 31న ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు టికెట్ల అమ్మకాలు ఈనెల 27 నుంచి జరుగుతాయని తెలిపింది. టికెట్ల ధరలను రూ.1,000, రూ.1500, రూ.2000, రూ.3,000, రూ.3,500, రూ.5,000, రూ.7,500గా నిర్ణయించింది. ఆన్లైన్ టికెట్లను మామూలు టికెట్లుగా మార్చుకునేందుకు నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఏసీఏ-వీడీసీఏ ‘బి’ గ్రౌండ్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారు ఈనెల 26 నుంచి, ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఆన్లైన్ టికెట్ పొందినవారు ఈనెల 27 నుంచి ఆయా కేంద్రాల్లో మార్చుకోవాలని సూచించారు.