చెన్నై : ఐపిఎల్లో నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో పథీరన ఒకడు. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్ సీజన్-17వ నిలకడగా రాణిస్తున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పథీరన జూనియర్ మలింగగా పేరుగాంచాడు. ఇటీవల జరిగిన ఓ షోలో మాట్లాడుతూ.. క్రికెట్లో తనకు మహేంద్ర సింగ్ ధోనీ తండ్రితో సమానమని పథీరన తెలిపాడు. ‘మా నాన్న తర్వాత నన్ను క్రికెట్లో ప్రోత్సహించేది మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే. ఆయన నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. నేను ఏం చేయాలో సలహాలు ఇస్తుంటారు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న కూడా ధోనీ లాగే పలు విషయాలు చెప్పేవాడు. మైదానంలో ఉన్నప్పుడు ధోనీ చెప్పే సలహాలు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. దాంతో, నాలో ఆత్మవిశ్వాసం రెండింతలు అవుతుంది. అందుకనే క్రికెట్ గురూ ధోనీ నాకు తండ్రితో సమానం’ అని పథిరన వెల్లడించాడు.