ప్రి క్వార్టర్స్‌లో సుతీర్థ, మానవ్‌కు నిరాశ

May 7,2024 23:04 #Sports

పారిస్‌ ఒలింపిక్స్‌ ఆశలు గల్లంతు
చెన్నై: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన భారత మహిళా టేబుల్‌ టెన్నిస్‌ బృందం పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రి క్వార్టర్స్‌ పోటీలో అహికా ముఖర్జీ-సుతీర్థ ముఖర్జీ జంట కొరియా జంట చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీ సాగిన ఈ మ్యాచ్‌లో సుతీర్ధ జంట 2-3(11-6, 9-11, 12-10, 6-11, 8-11) కొరియాకు చెందిన నగసాకి-నయోనేంగ్‌ చేతిలో పోరాడి ఓడారు. ఈ మ్యాచ్‌ సుమారు 43 నిమిషాలసేపు సాగింది. ఇక పురుషుల డబుల్స్‌లోనూ మనుష్‌ షా-మానవ్‌ ఠక్కర్‌ జంట కూడా ప్రి క్వార్టర్సలో 2-3(20-18, 4-11, 6-11, 11-9, 7-11)తో స్లొవేకియా జంట లుబోమిర్‌-చాన్‌ బాల్డ్‌విన్‌ చేతిలో పోరాడి ఓడారు. భారత మిక్స్‌డ్‌ టిటి జంట హర్మీత్‌ దేశారు-యశస్విని ఘెర్పండే 3-2(11-7, 9-11, 11-4, 4-11, 11-5తో చిలీకి చెందిన నికోలస్‌-పౌలీనాను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరారు.
ఐపిఎల్‌లో నేడు
సన్‌రైజర్స్‌ × లక్నో
వేదిక: హైదరాబాద్‌; రా.7.30గం||లకు

➡️