- షెఫాలీ డబుల్ సెంచరీ
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 603/6 స్కోరు చేసి డిక్లేర్డ్ చేసింది. దీంతో ఉమెన్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. దక్షిణాఫ్రికాతో ఓవర్ నైట్ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా బ్యాటర్లు హర్మన్ (69), రిచా ఘోష్ (86) ఐదో వికెట్కు 143 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్రస్తుతం సఫారీల జట్టు వికెట్ నష్టపోకుండా 8 ఓవర్లకు 33 పరుగులు చేసింది. లారా (17), అన్నెకె (12) క్రీజ్లో ఉన్నారు.