పారిస్: ఒలింపిక్ జ్యోతి టార్చ్ ఆతిథ్య దేశం ఫ్రాన్స్కు చేరింది. గ్రీన్ నుంచి ఒలింపిక్ టార్చ్ను త్రీామాస్ట్ ఓడ ద్వారా ఫ్రాన్స్లోని దక్షిణ సముద్ర తీర ప్రాంతం మార్సెయిల్కు చేరింది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో 2024 ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన విషయం తెలిసిందే. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెయిల్కి చేరుకుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అభిమానుల కోలాహలం మధ్య ఫ్రాన్స్లోని మార్సెయిల్కు బుధవారం సాయంత్రం చేరింది. బెలిమ్ అనే ఓడ ద్వారా రిలేను ఫ్రాన్స్కు తీసుకొచ్చారు. ఒలింపిక్ జ్యోతిని అథ్లెట్లు మార్కెయిల్లో ప్రదర్శనగా తీసుకెళ్లారు. జులై 14వరకు ఫ్రాన్స్లోని వివిధ నగరాల్లో తిరిగి జులై 14న ఆతిథ్య పారిస్ నగరాని చేరి 26న పారిస్ జరిగే ప్రాంతానికి చేరుకోనుంది.