బొర్రంపాలెంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ

ప్రజాశక్తి – టి.నరసాపురం

క్రిస్మస్‌ ఆనందం పేరుతో గత మూడు రోజులుగా మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో ఫర్‌ ద పీపుల్‌, యూత్‌ ఆధ్వర్యంలో సామాజిక వేత్త కలపర్తి విజరు వృద్ధులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా విజరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ ఆనందాన్ని పురస్కరించుకుని పేదలు, వృద్దులకు దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నామని, ఆక్రమంలోనే గత మూడు రోజులుగా గ్రామంలోని వృద్ధుల ఇంటికి వెళ్లి క్రిస్మస్‌ తాత వేషంలో పంపిణీ చేస్తున్నామన్నారు. మూడురోజుల్లో సుమారు రూ.30 వేలు విలువైన రగ్గులు, పండ్లు చాక్లెట్స్‌ 70 మందికి అందించామన్నారు. పేదల్లో నిజమైన క్రిస్మస్‌ ఆనందాన్ని పంచాలనెదే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ల సురేష్‌, అశోక్‌, మోషే, నాగేంద్ర, నరేష్‌, శరత్‌ పాల్గొన్నారు.

➡️