మరమ్మతుకు నోచని తాగునీటి బోరు

నిరుపయోగంగా ఉన్న బోరు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని పోతంగి సచివాలయ కార్యాలయానికి ఎదురుగా ఉన్న తాగునీటి బోరు మరమ్మతుకు గురై సుమారు నెల రోజుల నుంచి నిరుపయోగంగా ఉంది. స్థానిక గిరిజనులతో పాటు వివిధ పనుల నిమిత్తం యూనియన్‌ బ్యాంక్‌, పోతంగి సచివాలయానికి వచ్చిన గిరిజనుల దాహార్తి తీర్చు కోవడానికి ఈ బోరు ఎంతో ఉపయోగపడుతుంది. అధికారులు పట్టించుకోకపోవడంతో వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చిన గిరిజనులు తాగునీటి కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కారణంగా సచివాలయం వీధిలో ఉన్నవారికి తాగునీటి సమస్య ఏర్పడుతుంది. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న తాగునీటి బోరు మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️